Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి రానున్న కీర్తి సురేష్..?

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (12:03 IST)
ప్రముఖ నటి కీర్తి సురేష్ రాజకీయాల్లో రానుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహానటిలో సావిత్రిగా కీర్తి అదరగొట్టింది. సావిత్రి పాత్ర పోషించినందుకు ఆమె ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 
 
కీర్తి సురేష్ మూడు SIIMA అవార్డులు, సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. 2021లో ఫోర్బ్స్ ఇండియా, అండర్ 30 జాబితాలో కీర్తి స్థానం పొందింది. కీర్తి సురేష్ ప్రస్తుతం రాబోయే చిత్రం మామన్నన్ కోసం పని చేస్తోంది. 
 
ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వడివేలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మామన్నన్ సినిమా జూన్ 29న విడుదల కానుంది. 
 
ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కీర్తి సురేష్ పాల్గొంటోంది. మామన్నన్ పొలిటికల్ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాతీయ అవార్డు గ్రహీత రాజకీయ ప్రవేశంపై స్పందించారు. కీర్తి వ్యాఖ్యలతో ఆమె భవిష్యత్తులో రాజకీయ ప్రవేశంపై ఆసక్తి చూపుతోంది. 
 
కీర్తి సురేష్ బీజేపీలో చేరుతోందని సినీ పరిశ్రమలో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలను కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ ఖండించారు. మరి భవిష్యత్తులో కీర్తి సురేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 
 
టాలీవుడ్‌లో, కీర్తి సురేష్ చివరిసారిగా యాక్షన్ డ్రామా దసరాలో మహిళా ప్రధాన పాత్రలో కనిపించింది, దీనిలో ఆమె నేచురల్ స్టార్ నానితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు ఏం చెబితే సీబీఐ అదే చెబుతుంది: పేర్ని నాని పాత వీడియో వైరల్

హైడ్రాపై కేఏ పాల్‌ పిటిషన్‌.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తిరుమల లడ్డూ కల్తీ వివాదం : స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం

మూసీ నది బాధితులంతా బుల్డోజర్లతో వెళ్లి సీఎం రేవంత్ ఇంటిని కూల్చేస్తాం (Video)

కొండాసురేఖపై మండిపడిన అఖిల్.. క్షమించేది లేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments