హీరోయిన్లు ఇప్పుడు ఐటం గాళ్గా మారిపోతున్నారు. ఒకప్పుడు వాటికి ప్రత్యేకమైన నటీమణులు వుండేవారు. కానీ పరిస్థితులరీత్యా వేంప్ పాత్రలు చేసేవారు కనుమరుగయి హీరోయిన్లే చేయడం ఆనవాయితీ వస్తోంది. ఇటీవలే పుష్ప సినిమాలో సమంత, గని సినిమాలో తమన్నాలు ఐటెంసాంగ్లు చేసి కోట్ల రూపాయలు పారితోషికంగా పుచ్చుకున్నారు. సినిమా అంతా వుండి అందులో కష్టపడి నటించడంకంటే ఇదే బెటర్ అని భావిస్తున్నారు.
ఇప్పుడు అదే సెంటిమెంట్తో ఆమెను సంప్రదించడం అందుకు సుమారు కోటి పారితోసికం అగడం నిర్మాతలు అంగీకరించడం జరిగిపోయాయని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు.