Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయోపిక్‌లో జాన్వీ కపూర్..?

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె పైలెట్‌గా నటించనుంది. ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్.. తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. త

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (16:02 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె పైలెట్‌గా నటించనుంది. ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్.. తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. తాజాగా జాన్వీకపూర్ ఓ బయోపిక్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకునే సినిమాలో జాన్వీ కీలక పాత్రలో కనిపించనుందట. 
 
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఎఎఫ్) విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా దర్శకనిర్మాత కరణ్‌జోహర్ ఓ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో గాయపడిన భారతీయ సైనికులను మరో మహిళా పైలెట్ శ్రీవిద్య రంజన్‌తో కలిసి గుంజన్ సక్సేనా ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
ఈ మహిళా పైలెట్ సాహసోపేత గాథను ఆవిష్కరిస్తూ రూపొందనున్న సినిమాలో గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీకపూర్ నటించనున్నట్లు సమాచారం. పాత్ర తీరుతెన్నుల కోసం ఇటీవలే గుంజన్‌ను, జాన్వీ కలిశారని సమాచారం. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

Woman Constable: ఆర్థిక ఇబ్బందులు: ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments