Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయోపిక్‌లో జాన్వీ కపూర్..?

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె పైలెట్‌గా నటించనుంది. ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్.. తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. త

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (16:02 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె పైలెట్‌గా నటించనుంది. ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్.. తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. తాజాగా జాన్వీకపూర్ ఓ బయోపిక్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకునే సినిమాలో జాన్వీ కీలక పాత్రలో కనిపించనుందట. 
 
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఎఎఫ్) విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా దర్శకనిర్మాత కరణ్‌జోహర్ ఓ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో గాయపడిన భారతీయ సైనికులను మరో మహిళా పైలెట్ శ్రీవిద్య రంజన్‌తో కలిసి గుంజన్ సక్సేనా ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
ఈ మహిళా పైలెట్ సాహసోపేత గాథను ఆవిష్కరిస్తూ రూపొందనున్న సినిమాలో గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీకపూర్ నటించనున్నట్లు సమాచారం. పాత్ర తీరుతెన్నుల కోసం ఇటీవలే గుంజన్‌ను, జాన్వీ కలిశారని సమాచారం. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments