Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ ఓ మెంటల్‌గాడు... 'మా' అధ్యక్షుడు శివాజీరాజా

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒకరుకాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ ఆయన వ్యాఖ్యా

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (14:50 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒకరుకాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. 
 
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో పలువురు సినీ ప్రముఖులను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు పిలిచి విచారించిన విషయంతెల్సిందే. అయితే, ఈ విషయంలో సిట్ చీఫ్ అకున్ సభర్వాల్‌ను అందరూ బాహుబలితో పోలుస్తున్నారని, ఆయనతో రాజమౌళి బాహుబలి-3 సినిమా తీయాలని రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. దీంతో డ్రగ్స్ కేసు వ్యవహారం ఒక్కసారి వేడెక్కింది. 
 
పోలీస్ అధికారుల్ని రెచ్చగొట్టడం మనకే మంచిదికాదంటూ మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు శివాజీ రాజా అప్పట్లో వర్మకు సున్నితంగా కౌంటర్ ఇచ్చారు. అయినప్పటికీ ఆర్జీవీ తీరుమార్చుకోలేదు. అదేసమయంలో తెలుగు చిత్రసీమలో కొన్ని డ్రగ్స్ పురుగులు ఉన్నమాట వాస్తవమేనని, వాళ్లను మేమేదారిలో పెట్టుకుంటామని, ఇంతవరకూ జరిగిన సంఘటనలకు పరిశ్రమ బాధపడుతోందని తెలంగాణ ప్రభుత్వానికి మూవీ ఆర్టిస్టుల సంఘం, ఫిలిం ఛాంబర్ సంయుక్తంగా రాసింది. 
 
ఈ లేఖ మీద కూడా రాంగోపాల్ వర్మ అప్పుడే తీవ్రంగా స్పందించారు. ఈ లేఖ ద్వారా తాము చెయ్యని తప్పును ఒప్పుకున్నట్లయిందని, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని వర్మ సోషల్ మీడియాలో కామెంటరీ ఇచ్చేశారు. దీంతో మూవీ ఆర్టిస్టుల సంఘం వర్మను ఎట్టిపరిస్థిల్లోనూ ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒక్కరు కాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ మా అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments