Webdunia - Bharat's app for daily news and videos

Install App

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

సెల్వి
సోమవారం, 9 జూన్ 2025 (12:14 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరువు తీసింది యాంకర్ ఉదయభాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అనేక అడ్డంకులు పడుతూ ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 12న విడుదలని చెప్పి ఆ విడుదల తేదీని కూడా వాయిదా వేసేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. 
 
అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాకి డైరెక్టర్‌గా పనిచేసిన జ్యోతి కృష్ణ ఓ ప్రైవేట్ ఈవెంట్ పెట్టారు. ఈ సినిమాలోని ఒక పాట పవన్ కళ్యాణ్‌కి చాలా ఇష్టం. ఆ పాట ఆయన దాదాపు 500 సార్ల వరకు చూసి ఉంటారు.. అంటూ లైవ్ లోనే ఆ పాటని ప్లే చేయించారు.
 
దీనిపై ఉదయభాను పవన్ కళ్యాణ్ పరువు గంగలో కలిపేసింది. ఎందుకంటే పాట ప్లే చేస్తుండగా మధ్యలోకి వచ్చి పవన్ కళ్యాణ్ 500 సార్లు ఆ పాటను చూశారంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ పాట పాడే ఉంటారు. ఆ రహస్యాన్ని మీరు దాచేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాడిన ఆ పాట ఏంటో మీరు చెప్పాల్సిందే అంటూ మాట్లాడింది. 
 
కానీ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ మాట వినాలి అనే పాట పాడారు. ఈ పాట కూడా ఎప్పుడో విడుదలైంది. అయితే అలా విడుదలైన విషయం కూడా ఉదయభానుకి తెలియకపోవడం నిజంగా పవన్ కళ్యాణ్‌కి ఆయన అభిమానులకి అవమానమే అంటున్నారు చాలామంది ఈ వీడియో చూసిన నెటిజన్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments