Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జీవితం చేజేతులా నాశనం చేసుకున్నా : మనీషా కోయిరాలా

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ ఫ్రెండ్‌ను వివాహం చేసుకుని, ఆ తర్వాత వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా. ప్రస్తుతం కేన్సర్ బారి నుంచి కోలుకుని ముంబైలో నివశిస్తూ... సినిమాల్లో రెం

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (10:32 IST)
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ ఫ్రెండ్‌ను వివాహం చేసుకుని, ఆ తర్వాత వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా. ప్రస్తుతం కేన్సర్ బారి నుంచి కోలుకుని ముంబైలో నివశిస్తూ... సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. దీనిపై ఆమె స్పందిస్తూ... 
 
తన పెళ్లి ఫెయిల్ అవడానికి కారణం తానేనని చెప్పింది. తన భర్త సమ్రాట్‌ను ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో, అతని అభిరుచులు నచ్చి 2010లో వివాహం చేసుకున్నానని చెప్పింది. వివాహం గురించి ఎన్నో కలలు కన్నానని తెలిపింది. కానీ, ఆ కలలన్నీపగటి కలలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తంచేసింది. 
 
అదేసమయంలో వైవాహిక అనుబంధం సరైనది కానప్పుడు విడిపోవడమే మంచిదని భావించానని, అందుకే 2012లో విడాకులు తీసుకున్నానని తెలిపింది. అయితే ఇందులో తన భర్త తప్పు ఏమాత్రం లేదని తెలిపింది. తప్పంతా తనదేనని స్పష్టం చేసింది. కాగా, మనీషా పూటుగా తాగి పలు సందర్భాల్లో తూలుతూ మీడియా కంటబడిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం

బైక్ దొంగతనాలు.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..టెస్ట్ రైడ్ ముసుగులో..?

ఏపీలో రూపురేఖలు మారిపోనున్న రైల్వే స్టేషన్లు..

Bullet Train: హైదరాబాద్ - ముంబై, బెంగళూరు, చెన్నైలకు బుల్లెట్ రైళ్ల అనుసంధానం

శ్రీవారి కొండపై బ్రాండెడ్ లగ్జరీ హోటల్స్... లైసెన్సులు జారీ చేయనున్న తితిదే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments