Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ బయోపిక్‌'కు తేజనే దర్శకుడు.. ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి దర్శకుడిగా తేజ పేరును ప్రముఖంగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ చిత్రాలతో ఉన్న తేజ.. దగ్గుబాటి రానా హీరోగా తీసిన "నేనే ర

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (10:38 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి దర్శకుడిగా తేజ పేరును ప్రముఖంగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ చిత్రాలతో ఉన్న తేజ.. దగ్గుబాటి రానా హీరోగా తీసిన "నేనే రాజు నేనే మంత్రి" చిత్రంతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించే అంశంపై హీరో బాలకృష్ణ.. తేజను పిలిచి చర్చలు జరిపారు కూడా. 
 
నిజానికి తొలుత 'క్రిష్'.. లేదా 'తేజ'కు ఈ సినిమా బాధ్యతలను అప్పగించాలని 'బాలయ్య' యోచించారు. కానీ 'క్రిష్' మణికర్ణిక ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో 'ఎన్టీఆర్' బయోపిక్‌పై దృష్టి పెట్టే టైం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలను తాజాగా 'తేజ' స్వీకరించినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన తేజ... త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో బాలకృష్ణ నిర్మాతగా మారనున్నారని మరో టాక్. అయితే, ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 
 
ఇంకోవైపు, నిరంతరం వివాదంలో ఉండే రాంగోపాల్ వర్మ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు ఆర్జీవీ ప్రకటించిన విషయంతెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments