సినీ దిగ్గజం దాసరి నారాయణ రావు అంటే అందరికీ భయం, గౌరవం కూడా. కానీ అదే ఆయనకు మైనస్గా మారిందనే టాక్ విన్పిస్తోంది. 'ఎర్రబస్సు' అనే సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నాడు. నిన్న రాత్రి ఆడియో విడుదల చేశారు. అయితే కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో ఎంటర్టైన్మెంట్ జరిగింది. అవి పేలవంగా వున్నాయని చూసినవారంతా విమర్శిస్తున్నారు.
ఆవుదూడ కథలా కొన్ని ఎపిసోడ్స్ పరమ బోర్గా చెప్పినవే చెప్పి విసిగించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీన్ని దాసరి శిష్యులు ప్లాన్ చేశారని అంటున్నారు. ఫంక్షన్కు సినిమాకు పనిచేసిన కుటుంబాలే వచ్చాయి. ఫ్యాన్స్ పెద్దగా రాలేదు. ఈ కార్యక్రమం చూసిన టెక్నీషియన్స్ కుటుంబాలే పెదవి విరిచాయని సినీ జనం చెప్పుకుంటున్నారు.
ఇంత ఫెయిల్ ప్రోగ్రామ్ చేసినా... దాసరి ముందు ఆయన శిష్యులు సూపర్ అంటూ పొగిడేస్తూ ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారనే కామెంట్లు ఫిలింనగర్లో విన్పిస్తున్నాయి. కాగా, ఈ సినిమాకు పనిచేసిన వారంతా ఇప్పటి టెక్నాలజీని అవగాహన చేసుకోలేని పాతతరం దర్శకులే. మరి సినిమా రిలీజ్ తర్వాత ఎలా వుంటుందో చూడాల్సి ఉంది.