'గేమ్ ఛేంజర్': శంకర్‌తో దిల్ రాజుకి పొసగడం లేదా?

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (13:35 IST)
శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ హీరోగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాతో పాటు శంకర్ 'ఇండియన్ 2' కూడా చేస్తుండటం వలన, షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోంది.
 
అయితే 'గేమ్ ఛేంజర్' విషయంలో శంకర్‌తో దిల్ రాజుకి పొసగడం లేదనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. భారీగా ఖర్చు చేయించిన కొన్ని సీన్స్ అవుట్ పుట్ ను శంకర్ పక్కన పడేస్తున్నాడట. దాంతో ఖర్చు అనుకున్నదానికంటే ఎక్కువవుతోంది. పర్ఫెక్ట్ ప్లానింగుతో ముందుకు వెళుతున్న దిల్ రాజుకి ఇది నచ్చడం లేదని అంటున్నారు.
 
దిల్ రాజుకి నిర్మాతగా ఇది 50వ సినిమా. అందువలన అతికష్టం మీద శంకర్ ధోరణిని భరిస్తున్నాడని అంటున్నారు. శంకర్ గొప్ప దర్శకుడే .. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంతవరకూ ఆయన తమిళంలోనే తప్ప తెలుగు నిర్మాతలతో పని చేయలేదు. 
 
ఇక ఆయన 'రోబో 2.0' .. 'ఇండియన్ 2' సినిమాల నుంచే నిర్మాతల వైపు నుంచి అసంతృప్తిని ఎదుర్కున్నాడు. మరి 'గేమ్ ఛేంజర్' కు సంబంధించిన విషయంలో నిజమెంతనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల లడ్డు కల్తీ, సైజు తగ్గిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు: రమణదీక్షితులు

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు.. భారీ కార్యాచరణకు రంగం సిద్ధం

లవ్ జిహాద్ పేరుతో 300 మంది యువతులపై అత్యాచారం

మోహన్ బాబు - మంచు విష్ణులపై కేసు నమోదు

నా ఫోన్ నెంబరునే బ్లాక్ చేస్తావా? ప్రియుడి పొట్టలో కత్తితో పొడిచిన ప్రియురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments