Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు 150 సినిమా... టాలీవుడ్ రచయితలంతా కుస్తీ పడుతున్నారా...?!!

Webdunia
గురువారం, 21 మే 2015 (15:45 IST)
చిరంజీవి 150వ చిత్రం గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆయన కడపలో పర్యటిస్తే... సినిమా ఎప్పుడూ అని జనాలు ఎగబడ్డారు. ఇటీవలే ఈ చిత్ర కథపై వివాదం వచ్చింది. ఇది కావాలని పబ్లిసిటీ కోసం చేసిందా? నిజంగానే ఎన్‌ఆర్‌ఐ కథ ఇచ్చాడా? అనే విషయంలో సరైన క్లారిటీ ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. ఇక ఆ కథ తనదేనని పూరీ చెప్పడంతో క్లియర్‌ అయినట్లుంది. 
 
ఇది పక్కన పెడితే... ప్రస్తుతం ఈ సినిమాకు పూరీ స్నేహితులు.. బివిఎస్‌రవితో పాటు యంగ్‌ రచయితలంతా పనిచేస్తున్నారు. ఇంకోవైపు పరుచూరి బ్రదర్స్‌ కూడా తలోచేయి వేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గత ఏడాదిలో పరుచూరి సోదరులు.. ఓ పోరాటయోధుని కథ చెప్పడం.. అదిగో, ఇదిగో అని అనడం జరిగింది. కట్‌ చేస్తే.. ఇప్పటికి చిరు సినిమా ఓకే అయింది. 
 
కాగా, ఈ సినిమా మొత్తం రామ్‌చరణ్ పర్యవేక్షణలో జరుగుతుంది. కథ, డైలాగ్‌లో ఎటువంటి మార్పులున్నా... తనకు తెలియాల్సిందేనని సూచన కూడా చేశాడని ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి. ఈ విషయంలో పరుచూరి బ్రదర్స్‌ను పెద్దదిక్కుగా పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే జ్యోతిలక్ష్మి సినిమా విడుదలకు పూరీ సిద్ధంగా వున్నాడు. మరి చిరు సినిమాను కూడా అనుకున్న డేట్స్‌ ప్రకారం త్వరగా తీయాలని నిర్ణయించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments