బాలకృష్ణ వందో సినిమాపై వెలువడుతున్నవార్తలు హాట్ టాపిక్గా మారాయి. బాలయ్య వందో సినిమా కావడంతో సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ''గౌతమీపుత్ర శాతకర్ణి'' కథతో తెరకెక్కనున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ తెరకెక్కించనున్న ఈ చారిత్రక సినిమాలో నటీనటులతో పాటు, సాంకేతికంగానూ ఈ సినిమాని వైవిధ్యభరితంగా చూపేందుకు దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
అందులో భాగంగానే బాలీవుడ్ నటి హేమ మాలినిని తల్లి పాత్రకు ఎంపిక చేశాడు. అలాగే దర్శకుడు క్రిష్ బాలకృష్ణలు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం క్రిష్ ఈ చిత్రంలో నటీనటులను చాలా వరకు బాలీవుడ్ వాళ్ళని తీసుకుంటున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న క్రిష్ ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న చిత్రంతో అక్కడ కూడా క్యాష్ చేసుకొనే ఆలోచనలో ఉన్నాడట. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యుల్ని మొరాకోలో నెల రోజుల పాటు చేసేందుకు యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారట.