Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేజర్ ద్వారా ధనుష్ పుట్టుమచ్చల్ని చెరిపేశాడా? డీఎన్ఏ టెస్టుకు రెడీ కావాల్సిందేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు తల్లిదండ్రులు మేమేనని చెప్పుకుంటూ మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తాను కస్తూరి రాజా

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (18:49 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు తల్లిదండ్రులు మేమేనని చెప్పుకుంటూ మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తాను కస్తూరి రాజా పుత్రుడినా.. కదిరేశన్ కుమారుడినా అని నిరూపించుకునేందుకు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ కేసును కొట్టిపారేయాలని ధనుష్ తరపున పిటిషన్ కూడా దాఖలైంది. 
 
అయితే ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ధనుష్ తాను కస్తూరి రాజా కుమారుడైతే.. ఎందుకు సమయం కావాలని కోరాడని ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అంతేగాకుండా.. ఈ కేసుకు సంబంధించిన కీలక మెడికల్ రిపోర్టులో ధనుష్ తన శరీరంపై గల మచ్చలను లేజర్ ద్వారా తొలగించినట్లు సమాచారం. ధనుష్ తన శరీరంపై గల మచ్చల్ని ఇలా లేజర్ ద్వారా తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న తలెత్తింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ ఈ కేసు విచారణకు రానుంది. ఈ సందర్భంగా కదిరేశన్-మీనాక్షి దంపతులు ధనుష్‌కు డీఎన్ఏ పరిశోధన చేయాలని కోర్టును కోరనున్నట్లు తెలిసింది. ఈ టెస్టులో ధనుష్ తమ కుమారుడేనని తేలిపోతుందని కదిరేశన్ దంపతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments