Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 యేళ్ళ తరువాత బాలయ్యతో వినాయక్...

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (16:54 IST)
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సంవత్సరాల తరువాత ఒక అగ్ర దర్శకుడు, ఒక అగ్రహీరో కలవబోతున్నారు. వారెవరో కాదు సంచలన దర్శకుడిగా పేరొందిన వినాయక్, బాలక్రిష్ణ. ఆది సినిమాతో దర్సకుడిగా మారి ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు తీసిన వినాయక్ బాలక్రిష్ణతో ఒకే ఒక్క సినిమా తీశారు. అదే చెన్నకేశవరెడ్డి. అప్పట్లో ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. కానీ వీరి కాంబినేషన్ మాత్రం బాగుందని ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు.
 
ప్రస్తుతం బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా వున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో పూర్తవుతుంది. ఈ సినిమా తరువాత బాలక్రిష్ణ బోయపాటికి అవకాశమిస్తారని, వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ భావించారు. కానీ అది జరుగలేదు. వినాయక్‌తో కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చేశారట బాలక్రిష్ణ. 
 
గత రెండు రోజుల క్రితం బాలక్రిష్ణ స్వయంగా వినాయక్‌కు ఫోన్ చేసి కథను సిద్ధం చేయమని చెప్పాడట. దీంతో వినాయక్ ఒక మంచి కథను సిద్థం చేస్తున్నాడట. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments