16 యేళ్ళ తరువాత బాలయ్యతో వినాయక్...

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (16:54 IST)
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సంవత్సరాల తరువాత ఒక అగ్ర దర్శకుడు, ఒక అగ్రహీరో కలవబోతున్నారు. వారెవరో కాదు సంచలన దర్శకుడిగా పేరొందిన వినాయక్, బాలక్రిష్ణ. ఆది సినిమాతో దర్సకుడిగా మారి ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు తీసిన వినాయక్ బాలక్రిష్ణతో ఒకే ఒక్క సినిమా తీశారు. అదే చెన్నకేశవరెడ్డి. అప్పట్లో ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. కానీ వీరి కాంబినేషన్ మాత్రం బాగుందని ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు.
 
ప్రస్తుతం బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా వున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో పూర్తవుతుంది. ఈ సినిమా తరువాత బాలక్రిష్ణ బోయపాటికి అవకాశమిస్తారని, వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ భావించారు. కానీ అది జరుగలేదు. వినాయక్‌తో కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చేశారట బాలక్రిష్ణ. 
 
గత రెండు రోజుల క్రితం బాలక్రిష్ణ స్వయంగా వినాయక్‌కు ఫోన్ చేసి కథను సిద్ధం చేయమని చెప్పాడట. దీంతో వినాయక్ ఒక మంచి కథను సిద్థం చేస్తున్నాడట. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments