Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1500 కోట్ల కలెక్షన్లపై అస్త్రాన్ని ఎక్కుపెట్టిన "బాహుబలి"... లక్ష్యఛేదన సాధ్యమేనా?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి 2 కంక్లూజన్'. ఈ చిత్రం గత నెల 28వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా బ

Webdunia
సోమవారం, 8 మే 2017 (12:53 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి 2 కంక్లూజన్'. ఈ చిత్రం గత నెల 28వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా బాహుబలి రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా, బాహుబలి దెబ్బకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కుదేలైపోయింది. ఈ రంగానికి చెందిన గత రికార్డులన్నీ బాహుబలి దెబ్బకు తుడిచిపెట్టుకునిపోయాయి.  
 
బాహుబలి చిత్రం విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ.వెయ్యికోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా అధికారికంగా ప్రకటించింది. వసూళ్లు ఇప్పటికీ నిలకడగా ఉండటంతో బాహుబలి-2 పుల్‌రన్‌లో రూ.1500 కోట్లు దాటేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాహుబలి 2, ఇప్పటికీ కాసుల పంట పండిస్తోంది. విడుదలైన అన్నిచోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. 
 
ఇప్పటికే అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్ల్ బస్టర్‌గా నిలిచిన బాహుబలి 2, ఇప్పుడు సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పే దిశగా దూసుకుపోతుంది. ఆదివారం ఉదయానికి రూ.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీసింది. 
 
ఒక ప్రాంతీయ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు సాధించటమే కష్టంగా ఉన్న సమయంలో రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా బాహుబలి రికార్డ్ సృష్టించింది. ఈవారాంతం వరకు అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ బుకింగ్స్ హౌస్‌ఫుల్ కావడంతో బాహుబలి రూ.1500 కోట్ల మార్క్‌ను కూడా అతి త్వరలో చేరుకోవడం తథ్యమని సినీ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments