Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి దర్శకుడికి కోపమొచ్చింది.. తెలుగు సినిమాలు చేయడట.. బాలీవుడ్‌కి వెళ్ళిపోతాడట..?!

అర్జున్ రెడ్డి సినిమాపై వివాదం కొనసాగుతూనే వుంది. ఈ సినిమా పోస్టర్ల నుంచి విడుదలయ్యాక సన్నివేశాల మీద రచ్చ రచ్చ జరుగుతోంది. కానీ సినిమా మాత్రం విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకొని యూత్‌కి బాగా కనెక్ట్ కావడ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (15:36 IST)
అర్జున్ రెడ్డి సినిమాపై వివాదం కొనసాగుతూనే వుంది. ఈ సినిమా పోస్టర్ల నుంచి విడుదలయ్యాక సన్నివేశాల మీద రచ్చ రచ్చ జరుగుతోంది. కానీ సినిమా మాత్రం విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకొని యూత్‌కి బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్లతో దూసుకుపోతుంది.

యాంకర్ అనసూయ ఈ సినిమాపై కామెంట్ చేశారు. అర్జున్ రెడ్డి కథ తనది అంటూ నాగరాజు అనే రచయిత, దర్శకుడు ఫ్రేమ్‌లోకి వచ్చి తన కథని ఒక పోర్న్ సినిమా స్థాయిలో మార్చేశారని ఫిల్మ్ చాంబర్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ, కాంగ్రెస్ మహిళా నాయకులు, మహిళా సంఘాలు అర్జున్ రెడ్డి వివాదాన్ని పెంచాయి.
 
ఈ వివాదాలతో ఈ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అవుతూ జనాలు సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. కేవలం వివాదాలతో, యూత్‌కి నచ్చే బూతులతో సినిమా మొత్తం నడిపించేసి, అర్జున్ రెడ్డికి వచ్చిన బజ్‌తో కలెక్షన్ పొందాలనుకోవడం నిజంగా సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. 
 
అయితే ఈ సినిమా దర్శకుడు మాత్రం విభిన్నంగా స్పందించాడు. సందీప్‌తో సినిమా చెయ్యడం కోసం ఇప్పుడు పెద్ద హీరోలు సైతం క్యూ కట్టేసే పరిస్థితి ఉంది. అయితే సందీప్ మాత్రం కాస్త సీరియస్ అయ్యాడు. తనను అడ్డుకోవాలని చూస్తే తాను తెలుగు సినిమాలను పక్కనబెట్టి.. బాలీవుడ్‌కు వెళ్ళిపోతానని చెప్పాడు. హిందీ, భోజ్‌పురి, కన్నడ... ఇలా ఏ భాషలో అయినా సినిమాలు తీసుకుంటానని వెల్లడించారు. 
 
బాలీవుడ్‌లో తనను బ్యాన్ చేస్తే హాలీవుడ్‌కు వెళ్ళిపోతా.. ఇంతకంటే ఏం చేయలేను. అసలు మహిళా సంఘాలు ఎందుకు స్పందిస్తున్నాయో తనకైతే అర్థం కావట్లేదన్నారు. ఈ కథ మరో సినిమా కథకు కాపీ అన్న వివాదం ఒకటి కొత్తగా పుట్టుకొచ్చినా... దీనిపై కూడా సందీప్ మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం