ఆ దర్సకుడితో రంగమ్మత్తకు చెడిందా? (Video)

Webdunia
బుధవారం, 8 జులై 2020 (19:48 IST)
బుల్లితెరమీదే కాదు వెండితెర మీద కూడా వెలుగొందుతోంది అనసూయ. జబర్దస్త్ తోనే ఆమెలోని టాలెంట్ బయటకు వచ్చింది. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
 
కరోనా సమయంలోను తన అభిమానులతో ఛాటింగ్ చేస్తూ సేఫ్ హోమ్ అంటూ చెబుతూ వచ్చింది. అయితే రంగమ్మత్తకు దర్సకుడు క్రిష్ణవంశీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. రంగమార్తాండ సినిమాలో రంగమ్మత్తుకు అవకాశం వచ్చింది.
 
అది కూడా కరోనాకు ముందే ఆమెకు ఈ అవకాశం లభించింది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యక్రిష్ణలవి కీలక పాత్రలైతే అనసూయ పాత్ర కూడా కీలకమేనట. మరాఠీలో సూపర్ హిట్ అయిన సినిమా ఆధారంగా రంగమార్తాండ సినిమా తెరకెక్కుతోంది.
 
కరోనా పుణ్యమా అని రెండునెలల పాటు షూటింగ్ నిలిచిపోతే తెలంగాణా ప్రభుత్వ అనుమతితో ప్రస్తుతం మళ్ళీ షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. అయితే షూటింగ్ లకు అనసూయ కూడా రెగ్యులర్ కూడా హాజరవుతోందట.
 
కానీ షూటింగ్ సమయానికి సరిగ్గా రాకపోవడం.. ఆలస్యంగా ఆమె రావడంతో దర్సకుడు క్రిష్ణవంశీతో వాగ్వాదం కూడా జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఒకవైపు జబర్దస్త్ మరో వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉండడం వల్ల ఆమెకు సమయం సరిపోవడం లేదట.
 
రంగమార్తాండలో అనసూయకు ఇచ్చిన క్యారెక్టర్ ఆమెకు కరెక్టుగా సరిపోతుందట. అయితే ఆమె మాత్రం షూటింగ్‌కు సరైన సమయానికి రాకపోవడంతో క్రిష్ణవంశీ వేరే యాక్టర్‌ను వెతుక్కోవడానికి సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే అనసూయపై చేయాల్సిన సన్నివేశాలను పెండింగ్ పెట్టారట.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరుదైన ఖనిజ నిక్షేపాలలో సుమారు 30 శాతం వాటాను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్: B2K విశ్లేషణ

130 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి... హెవీ డంపర్ ఆపరేటర్లుగా మహిళలు

మే 30 నుంచి తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ప్రారంభం

తరుముకొస్తున్న సంక్షోభం - వర్క్ ఫ్రమ్ హోంపై సీఎం బాబు దృష్టి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. కారు డిక్కీలో పిల్లలు... ప్రమాదకరమైన జర్నీ (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

డయాబిటీస్, ఊబకాయం పోషణ రంగంలో మరింత శక్తివంతం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్

తర్వాతి కథనం
Show comments