Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీతో అనుష్క.. మలయాళ సినిమాలపై కన్నేసింది.. మంచి స్క్రిప్ట్ దొరికితే?

"గురు" సినిమా తర్వాత విక్టరీ వెంక‌టేష్ మ‌ల్టీ స్టార‌ర్‌ చిత్రంలో నటించనున్నాడు. నేనే రాజు నేనే మంత్రితో చాలాకాలం త‌రువాత సక్సెస్ సాధించిన తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీ

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (16:48 IST)
"గురు" సినిమా తర్వాత విక్టరీ వెంక‌టేష్ మ‌ల్టీ స్టార‌ర్‌ చిత్రంలో నటించనున్నాడు. నేనే రాజు నేనే మంత్రితో చాలాకాలం త‌రువాత సక్సెస్ సాధించిన తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. వెంకీతో రానా కలిసి నటించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఒక హీరోయిన్‌గా అనుష్కను ఎంపిక చేశారు. 
 
మ‌రో హీరోయిన్ పేరును నవంబర్ 16వ తేదిన ప్ర‌క‌టించ‌నున్నారు.. అదే రోజున ఈ మూవీకి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి షూటింగ్‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, ఏకే.ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో వెంకీతో నటిస్తూనే అనుష్క మలయాళ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా పేరు సంపాదించిన అనుష్క.. మలయాళ సినిమాల గురించి మాట్లాడుతోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ తలెత్తుకునేలా మలయాళ సినిమా చేయగలదని.. తన తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తున్నాయని తెలిపింది. 
 
మలయాళ ప్రేక్షకులకు సినిమాలపై మంచి అవగాహన ఉందనీ .. అక్కడి సినిమాల్లో ఎంతటి కథాబలం వుంటుందనే విషయం తాను సినిమాల్లోకి వచ్చాక అర్థమైందని అనుష్క చెప్పింది. స్క్రిప్ట్ బాగుంటే చేసేస్తానని అనుష్క అంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments