Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2లో సాయిపల్లవి.. గిరిజన యువతిగా కనిపిస్తుందా? (video)

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (11:35 IST)
తన సహజమైన నటనతో పాపులర్ అయిన సాయి పల్లవి పుష్ప-2లో భాగం కానుంది. పుష్ప 2: ది రూల్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ లేడీ రష్మిక మందన్న నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప-2లో సాయి పల్లవి నటిస్తుందని ప్రచారం సాగుతోంది. 
 
ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ తాజా సమాచారం సాయిపల్లవి నటించనుందని తెలిసింది. ఈ సినిమాలో ఆమె కీలకమైన అతిథి పాత్రలో మెరవబోతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ సినిమా షూటింగ్‌లో త్వరలో సాయి పల్లవి జాయిన్ అయినట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె గిరిజన యువతిగా కనిపించనుంది. ఈ సినిమా కోసం ఆమె పది రోజుల పాటు డేట్స్ కేటాయించినట్లు సమాచారం. 
 
సాయి పల్లవి సెట్స్‌పైకి వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్, సాయి పల్లవి కాంబో అద్భుతంగా ఉంటుంది. 
 
ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ హైదరాబాద్‌లో అల్లు అర్జున్, సాయి పల్లవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. పుష్ప ది రూల్ 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి సీక్వెల్. పుష్ప పార్ట్ వన్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments