Webdunia - Bharat's app for daily news and videos

Install App

1970ల నాటి కథతో వెబ్ సిరీస్.. కీలక పాత్రలో అమలాపాల్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (20:14 IST)
1970ల నాటి కథతో తెలుగు- తమిళంలో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. అప్పటి పరిస్థితుల్ని తెలిపే నవల ఆధారంగా ఈ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రధారిగా ఆమె హీరోయిన్ అమలా పాల్‌ కనిపించనుంది. 
 
అయితే ఈ సిరీస్‌‌ ఆమెకు రెండో వెబ్ సిరీస్ కావడం విశేషం. హిందీలో మహేశ్‌ భట్‌, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి అమలా పాల్‌ ఇటీవల ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అమలాపాల్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అంటే అమలా పాల్‌ ఓటీటీలోనూ తన జోరు చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా దర్శక నిర్మాతలు వెబ్‌సిరీస్‌లు, వెబ్‌ సినిమాల వెంటపడుతున్నారు. దీనికి హీరోయిన్లు కూడా అతీతం కాదు. సమంత ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' చేయగా... నిత్యమీనన్‌, సాయిపల్లవి, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం అమలా పాల్ కూడా అదే బాటలో పయనిస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments