Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ "డీజే"కు బ్రేక్.. పెద్ద నోట్ల రద్దే కారణమా?

అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రంలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్త

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (10:47 IST)
అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రంలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. ఇంతలోనే ఈ చిత్రం షూటింగ్‌కు పూర్తిగా బ్రేక్ పడినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వస్తున్నాయి. నెలరోజుల పాటు బన్ని షూటింగ్‌కి దూరం కాబోతున్నాడు. 
 
నిజానికి ఇటీవల బన్ని-స్నేహా రెడ్డి దంపతులకి పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెల రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి.. ఫ్యామిలీతో గడపాలని బన్ని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. దీంతో షూటింగ్‌కి కంఫ్లీట్ గా బ్రేక్ ఇవ్వకుండా.. బన్ని లేని సన్నివేశాలని మాత్రమే చిత్రీకరించేందుకు నిర్మాత, దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
 
అయితే, ఫిల్మ్ నగర్‌లో వాదన వినిపిస్తోంది. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఈ చిత్ర షూటింగ్‌కు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. చిత్ర షూటింగ్ కోసం డబ్బులు ఖర్చు విషయంలో నిర్మాత ఆచితూచి అడుగులు వేస్తున్నారనే వదంతలు వినిపిస్తున్నాయి. అందువల్లే చిత్రం షూటింగ్‌కు బ్రేక్ వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments