ఇటీవల నాగార్జున మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నానని చెబుతూ.. సోలో హీరోగా ఓ చిత్రం చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. అందులో ఒక పాత్రకు రమ్యకృష్ణ భార్యగా నటిస్తుంది. ఇంకో పాత్ర కొత్తగా కన్పిస్తాడు. అయితే ఇందులో మొదటి పాత్ర అనేది వృద్ధుని పాత్ర.. అంటే తాతయ్యగా నటిస్తున్నాడని తెలిసింది.
ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ఇతను కొత్త దర్శకుడు. ఈ దర్శకుడు అఖిల్ను హీరోగా పరిచయం చేయడానికి కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ.. నాగార్జున పట్టేశాడు. నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రం లాంఛనంగా రేపు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సోగ్గాడే చిన్ని నాయన.. అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.