Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు ఫేవరేట్‌గా మారిన ఆ బూతు డైలాగ్!

Webdunia
బుధవారం, 2 జులై 2014 (14:49 IST)
టాలీవుడ్ క్రేజీ స్టార్ సమంత, నాగచైతన్య నటించిన "ఆటోనగర్ సూర్య" ఆశించినంత స్థాయిలో ఆదరణ తెచ్చుకోకపోయినా తనకు మాత్రం భలే నచ్చేసిందని అంటోంది. అయితే ఇందులో ఓ డైలాగ్ తనకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని చెబుతోంది ఈ భామ. అంతేకాదు ఈ డైలాగ్ ఎప్పటికీ నాకు ఫేవరేట్ అని అంటోంది.

ఇప్పటివరకు చాలా చిత్రాల్లో నటించాను, ఏ డైలాగ్ గుర్తుంటుందో గుర్తుండదో తెలియదు కానీ ఆటోనగర్ సూర్య చిత్రంలో చెప్పిన ఆ డైలాగ్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అని మరీ చెబుతోంది సమంత. ఆటోనగర్ సూర్య చిత్రంలో విలన్ ఆమెని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో "పెళ్లి చేసుకో.. కానీ పిల్లలు మాత్రం వాడితోనే.. పిల్లల పోలికలు మాత్రం గ్యారంటీ ఇవ్వలేను ఎందుకంటే పిల్లలు వాడి పోలికలతోనే పుడతారు" అని గట్టిగా చెబుతుంది. ఆ డైలాగ్‌‌‌కి థియేటర్‌లో ఈలలు, చప్పట్లు మారుమోగుతున్నాయి. ఆ డైలాగ్ తనకి బాగా నచ్చిందని చెబుతోంది ఈ భామ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‍కు డ్రోన్లతోపాటు సైన్యాన్ని కూడా పంపించిన టర్కీ

Boycott Turkey: పాకిస్తాన్‌కి మద్దతిచ్చిన టర్కీకి ఇండియన్స్ షాక్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు

Monkey: ఈ వానరం బాగా తెలివైంది.. వీడియో వైరల్

విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments