బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్పై ఉన్న కృష్ణజింకలను వేటాడిన కేసులో తుది తీర్పును మార్చి మూడో తేదికి వాయిదా వేశారు. పదహారేళ్ల కిందట బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అక్రమ ఆయుధాల కేసు తుది విచారణ బుధవారం జోధ్ పూర్ కోర్టు జరిగింది. ఈ విచారణ నిమిత్తం సల్మాన్ కోర్టుకు వచ్చారు.
అయితే కేసును విచారించిన కోర్టు తుది తీర్పును మార్చి 3వ తేదికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపున న్యాయవాది పిల్ దాఖలు చేశాడు.
కాగా అక్టోబర్, 1998లో జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అడవిలో మూడు చింకారాలు, ఒక కృష్ణజింకను వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్లూపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో సల్మాన్ పై నేరం రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడవచ్చని, అంతేగాక వెంటనే బెయిల్ కూడా దొరకదని సమాచారం.