ఇటీవలే ఐస్క్రీమ్ సినిమా తీసిన రామ్గోపాల్వర్మ సీక్వెల్గా రెండో భాగాన్ని తీస్తున్నారు. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా పండుగనాడు విడుదల చేశాడు. జెడి చక్రవర్తి, నందు, నవీన, గాయత్రి, సిద్దు, భూపాల్, జీవా కీలక పాత్రధారులు.
చిత్ర నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ... సినిమా ఎలా వుంటుందనేది ట్రైలర్, పాట చెబుతుంది. వర్మతో వరుసగా సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు. వర్మ సిల్వర్జూబ్లీ జరుపుకుంటున్న ఈ ఏడాది నాతో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేస్తున్నామని తెలిపారు.
వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎన్టిఎఫ్ఐ అని వేయడానికి కారణం ఓల్డ్ ఫిల్మ్ టెక్నాలజీలో ఉపయోగించిన టెక్నికల్ వాల్యూస్ని ఉపయోగించకుండా కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. మొదటి పార్ట్ టెస్ట్ మాత్రమే. ఇందులో పూర్తి టెక్నాలజీ వాడాను. ఇంకా మూడు భాగాలు కూడా భిన్నంగా చూపిస్తాను అని చెప్పారు. జెడి చక్రవర్తి మాట్లాడుతూ.., పాటను చూసి షాక్ అయ్యాను. చాలా అద్భుతంగా వుంది. ప్రతి ప్రేక్షకుడు కొత్తగా ఫీలయ్యేట్లు వుంటుంది అన్నారు.