ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హ్యాట్రిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'సింహా' నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ 'పండగ చేస్కో'. ఈ చిత్రం నాన్స్టాప్గా షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్ర విశేషాలను దర్శకుడు గోపీచంద్ మలినేని తెలియజేస్తూ - ''మా 'పండగచేస్కో' చిత్రం షూటింగ్ నాన్స్టాప్గా జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ కొత్త లుక్లో కనిపించబోతున్నారు. కాస్ట్యూమ్స్తోపాటు రామ్ గెటప్ కూడా డిఫరెంట్గా డిజైన్ చెయ్యడం జరిగింది. అందరు ఆర్టిస్టులు పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది.
సెప్టెంబర్లో అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేశాం. నవంబర్ 15 వరకు జరిగే షూటింగ్తో టోటల్గా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. రామ్ బాడీ లాంగ్వేజ్కి తగినట్టుగా హీరో క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్గా వుంటుంది. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ చిత్రానికి 'పండగ చేస్కో' టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్గా వుంటుంది. థమన్ చాలా ఎక్స్లెంట్ మ్యూజిక్ ఇస్తున్నారు. యూత్తోపాటు అందర్నీ ఎంటర్టైన్ చేసే సినిమా ఇది'' అన్నారు.