Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు చనిపోలేదు... బాపు బొమ్మల్లో సజీవంగా ఉన్నారు : రాజేంద్రప్రసాద్

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (21:58 IST)
టాలీవుడ్ దిగ్గజం బాపు శాశ్వత నిద్రలోకి జారుకోలేదని, ఆయన కుంచె నుంచి జాలువారిన బొమ్మల్లో సజీవంగా ఉన్నారని హస్య కిరీటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం సాయంత్రం కన్నుమూసిన బాపు మృతిపై ఆయన స్పందిస్తూ... రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తిలో ఉన్న నటుడిని వెలికి తీసి వెండి తెరకు పరిచయం చేసింది బాపు - రమణలేనని గుర్తు చేసుకున్నారు. 
 
నిజానికి తన ప్రియనేస్తం ముళ్ళపూడి వెంకటరమణ చనిపోయాక, బాపు ఎంతోకాలం ఉండరని అనిపించిందని పేర్కొన్నారు. బాపు పాత్రలన్నీ మనకు దగ్గరగా అనిపిస్తాయని తెలిపారు. మహానటుడు ఎన్టీఆర్‌కు కూడా బాపుగారంటే ఎంతో ఇష్టమని గుర్తు చేశారు. ఇంట్లో బిడ్డలానే తనను బాపు చూశారని గుర్తు చేసుకున్నారు. 
 
కొందరు మనుషులు చనిపోయిన తర్వాత కూడా జీవించే ఉంటారనడానికి బాపు సిసలైన నిదర్శనం అని కీర్తించారు. ఆయన గీసిన బొమ్మలు, తీసిన సినిమాలు ఆయనను సజీవుడిగా నిలుపుతాయని అన్నారు. మాటల రచయిత ముళ్ళపూడితో బాపు ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. వీరిద్దరూ ఎన్నో చిత్రాలకుగాను బాధ్యతలు పంచుకున్నారని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments