దక్షిణాది చిత్ర సీమలో మలయాళీ బ్యూటీలదే పైచేయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా కేరళ నుంచి టాలీవుడ్కు వచ్చిన బ్యూటీ కేథరిన్ త్రేశ్రా. ఇద్దరమ్మాయిలతో, ఎర్రబస్సు , పైసా వంటి సినిమాల్లో నటించిన కేథరిన్ ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న రుద్రమదేవి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది.
ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానున్నది. ఈ సినిమాతో ఆమె కెరీర్ కి మంచి మలుపు అవుతుంది అనే ధీమా వ్యక్తం చేస్తోంది కేథరిన్. ప్రస్తుతం ఈ అమ్మడు స్పీడు పెంచింది. తాజాగా కేథరిన్ కథలో ఓ సినిమా చేరిందని తెలుస్తుంది. అక్కినేని హీరో సుశాంత్ హీరోగా త్వరలో ఓ సినిమా మొదలు కానున్నది.
ఈ సినిమాకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. శ్రీనాగ కార్పోరేషన్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో సుశాంత్ సరసన కేథరిన్ హీరోయిన్గా నటిస్తున్నట్టు సమాచారం.