నందమూరి బాలకృష్ణ సరసన మరోసారి నటించేందుకు నయనతార రెడీ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన 'సింహా', 'శ్రీరామరాజ్యం' చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ జంటతో మరిన్ని చిత్రాలు వస్తాయని సినీ వర్గాలు ఊహించాయి. అయితే నయనతార తమిళ చిత్రాలలో బిజీగా ఉండడంతో టాలీవుడ్కు కాస్త దూరమైంది.
కొత్త గ్యాప్ తర్వాత మళ్లీ ఈ జంట వెండితెరకు రానుంది. బాలయ్య 99వ చిత్రానికి 'లౌక్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్, గోపీ మోహన్ కలసి దీనికి సంయుక్తంగా డైలాగులు రాస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నటించేందుకు నయనతారను ఎంపిక చేశారు. తమన్ సంగీతం సమకూర్చే ఈ చిత్రం 'లయన్' షూటింగ్ ముగియగానే కొత్త చిత్రం సెట్పైకి వస్తుందని సమాచారం.