Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ కలిసిన హిట్ పెయిర్.. మరో హిట్‌కు రెడీ..!

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (15:42 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, క్రేజీ బ్యూటీ సమంతాలు జంటగా నటించిన 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి చిత్రాలు విజయం సాధించడంతో ఈ జంటగా హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. అయితే, ఆ తర్వాత మహేష్ 'నేనొక్కడినే'  సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమా పోస్టర్‌పై సమంతా వివాదాస్పద వ్యాఖ్యలుచేసి మహేష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. 

ఈ సంఘటనతో మహేష్ కూడా మనస్తాపం చెందాడు. అప్పటి నుంచి మహేష్, సమంతలు కలిసి నటించలేదు. దీంతో వారిద్దరు ఇక కలిసి నటించేందికాదుకదా, ‌కలిసి కనిపించరు కూడా అని కోలీవుడ్ అనుకుంది. ఈ స్థితిలో గత నెలలో జరిగిన మేము సైతం వేడుకలకు వారిద్దరిని ఆహ్వానించారు. అయితే వారు అందుకు ససేమిరా అనడంతో దర్శకుడు త్రివిక్రమ్ ఒక ప్లాన్ చేశారు.
 
ఆ ప్లాన్ ప్రకారం 'మేము సైతం' వేడుకలో మహేష్, సమంతాను కలిసి చాట్ చేసే విధంగా చేయడంతో వారి మధ్య చోటు చేసుకున్న మౌనం వీడింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఈ జంట వెండితెరకు రానుంది. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో కె.రాధాకృష్ణ నిర్మించే చిత్రంలోనే. ఎలాగైతేనేమి త్రివిక్రమ్ శ్రీనివాస్ విడిపోయిన హిట్ పెయిర్‌ను కలిపి, మరో హిట్టు కొట్టేందుకు సిద్ధం చేస్తున్నారనమాట.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments