అజిత్ నటించిన గాంబ్లింగ్ (తమిళంలో మంగాత్త) సినిమాలో నటించిన హీరోయిన్స్ లక్ష్మీరాయ్, త్రిషల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అబద్ధం ఆడితే లక్ష్మీరాయ్కి పడదట.. అందుకే త్రిషకు తెల్లపిల్ల చురకలంటించింది. ఏ విషయంలోనూ అబద్ధాలంటే తనకు పడదని.. అందుకే, వాస్తవాన్ని ఉన్నదున్నట్టు అంగీకరించాలని అంటోంది.
ఈ విషయంలో చెన్నై సోయగం త్రిషకు లక్ష్మి ఇప్పుడు చురకలంటించింది. "తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ నిజాన్ని అంగీకరించాలంటే వాళ్లకి ధైర్యముండాలి. అలాంటి వాస్తవాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పడానికి నోరెలా వస్తుందో నాకు ఆశ్చర్యంగా వుంది" అంటూ ఈ ముద్దుగుమ్మ తాజాగా కామెంట్ చేసి, వార్తల్లోకి ఎక్కింది.
ఈ కామెంట్ కచ్చితంగా త్రిషను దృష్టిలో పెట్టుకునే చేసిందని కోలీవుడ్ జనం గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల త్రిషకు, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్కు నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలు రావడాన్ని.. త్రిష ఖండించిన నేపథ్యంలో లక్ష్మీరాయ్ ఈ కామెంట్స్ చేసివుంటుందని సినీ జనం అనుకుంటున్నారు. మరి లక్ష్మీరాయ్ కామెంట్స్పై త్రిష ఏ మేరకు స్పందిస్తుందో? వేచి చూడాలి.