Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాది.. ఉత్తరాది రెండూ ముఖ్యమే..!: కృతిసనన్

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2015 (19:35 IST)
టాలీవుడ్, బాలీవుడ్ తనకు రెండూ ముఖ్యమేనని మహేష్ హీరోయిన్, వన్ భామ కృతిసనన్ చెప్పింది. ఉత్తరాది, దక్షిణాది సినిమాలను సమన్వయం చేసుకుని కెరీర్‌ను కొనసాగిస్తానని ఆమె తెలిపింది. 'హీరోపంటీ' సినిమాతో జాకీష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ సరసన బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన కృతి, 'వన్' సినిమాతో టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు సరసన అరంగేట్రం చేసింది. 
 
'హీరోపంటీ' సినిమా బాలీవుడ్‌లో మంచి వసూళ్లు సాధించగా, తెలుగునాట 'వన్' డిజాస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్‌లో ప్రతిభ ఉన్న నటులు చాలామంది ఉన్నారని చెప్పింది. రెండు పరిశ్రమల్లో పనిచేస్తూ తాను సరైన మార్గంలోనే పయనిస్తున్నానని కృతిసనన్ విశ్వాసం వ్యక్తం చేసింది.
 
ఇదిలా ఉంటే కృతిసనన్‌కు ఈ మధ్య బాలీవుడ్ ఆఫర్లు మెండుగా వస్తున్నాయని సినీ జనం చెప్తున్నారు. ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో అమీర్‌ఖాన్ స‌ర‌స‌న కృతిస‌న‌న్ న‌టించాల్సి ఉండ‌గా, చివ‌రి నిముషంలో కృతిస‌న‌న్‌కు ఆఫ‌ర్ వ‌రించ‌లేదు. కాని కృతిస‌నన్‌తో కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌తో స‌రిపెట్టకుండా, త‌న‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ఆమీర్‌ఖాన్ ఆలోచిస్తున్నాడు. దీంతో అమీర్ స‌ర‌స‌న కృతిస‌న‌న్ హీరోయిన్‌గా చేస్తుంద‌ని అప్పుడే బాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.
 
మహేశ్ బాబు 1 సినిమాను రీమేక్ చేయడానికి అమీర్ ఖాన్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థే హిందీలో కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. మరోవైపు వరుణ్ ధావన్‌తో కృతిసనన్ నటించబోతోంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments