లోకనాయకుడు కమలహాసన్ నటించే ప్రతి సినిమా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'అమర్ హై' దాదాపు ఖరారైంది. గత 2012లో అప్పటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉండే కథతో బాలీవుడ్లో ఓ సినిమా నిర్మించాలనుకున్న కమల్ విశ్వరూపం సినిమాకు వచ్చిన వివాదాల కారణంగా ఆ సినిమాను చేయలేదు.
విశ్వరూపం సినిమా వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం, కమల్ కంటతడి పెట్టడం, ఏకంగా దేశాన్నే వదిలి వెళ్లిపోతానని ప్రకటించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ప్రస్తుతం కమల్ హాసన్ 'విశ్వరూపం 2', 'ఉత్తమవిలన్', 'పాపనాశం' చిత్రాలను పూర్తి చేశారు.
ఈయన ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. కాగా వీటిలో ఒకటి థ్రిల్లర్ కథాంశంతో, తమిళంలో రూపొందిస్తున్నారు. మరొక చిత్రమే 'అమర్ హై'. ఈ చిత్రాన్ని రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాలని కమల్ అనుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.
ఈ హిందీ సినిమాలో కమల్తో పాటు వీరేంద్ర అరోరా, అర్జున్ కె.కపూర్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. 'అమర్ హై' పై ఆ ఇద్దరు నిర్మాతలు స్పందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, కమల్ సినిమా ఆగిపోలేదని వెల్లడించారు. నవంబర్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుందని, కేవలం ఐదు నెలల్లో ఈ సినిమా పూర్తి చేసి విడుదల చేస్తామని తెలపడం విశేషం.