తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో బంద్ పిలుపు ఇవ్వడంతో.. సినిమా ఇండస్ట్రీలో షూటింగ్లకు అంతరాయం ఏర్పడింది. రామోజీ ఫిలింసిటీలో జరగాల్సిన షూటింగ్లన్నీ వాయిదా పడ్డాయి.
నటీనటులు, టెక్నీషియన్ల కాల్షీట్లు అన్నీ డిస్టబ్ అయ్యాయి. యమలీల-2 చిత్రం క్లెమాక్స్ సన్నివేశాలు జరగాల్సి ఉండగా వాయిదా వేయాల్సివచ్చింది.
ఇదే బాటలో జూబ్లీహిల్స్లోని పలు చోట్ల షూటింగ్లన్నీ వాయిదా వేసుకున్నారు. మణికొండలో కొన్ని చోట్ల టీవీ సీరియల్స్ మాత్రమే నడిచాయి. అందుకు పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం.
అయితే ఈ బంద్లవల్ల తనకు నష్టం జరిగిందంటూ.. నటి కాజల్ ట్వీట్ చేసింది. అది కూడా చాలా తెలివిగా పోస్ట్ చేసింది.
ఈ బంద్లు వేస్ట్. టైమ్ వృధా, ఖజానాకు గండి పడుతుందంటూ ట్వీట్ చేసింది. మరి కేసీఆర్ ఫ్యాన్స్కు ఈ విషయం తెలిశాక ఏం కామెంట్లు చేస్తారో చూడాలిమరి.