Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం అడిగారో.. ఎంతటి వారినైనా వదలా: అమీర్ ఖాన్

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (17:49 IST)
లంచం అడిగారో వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. సినిమా సెన్సార్ సందర్భంగా తాను ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వలేదని తెలిపారు. 
 
ఇటీవల సెంట్రల్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డ్ సీఈఓ రాకేష్ కుమార్ లంచం తీసుకుంటూ అరెస్టయిన నేపథ్యంలో అమీర్ ఖాన్‌పై విధంగా స్పందించారు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ ప్రాంతీయ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడానికి రూ. 70 వేల లంచం అడిగారనే ఆరోపణలతో రాకేష్ కుమార్ ఇటీవల అరెస్టు అయ్యారు. 
 
అయితే రాకేష్ కుమార్ లంచం వ్యవహారంపై స్పందించడానికి అమీర్ ఖాన్ నిరాకరించారు. తన వద్ద అతను ఎప్పుడూ లంచం అడగలేదని, అందుకే ఈ విషయమై తాను స్పందించబోనని అమీర్ ఖాన్ స్పష్టం చేసారు. 
 
ఇకపోతే.. అమీర్ ఖాన్ తాజా సినిమా ‘పి.కె'కు సంబంధించి ఇటీవల విడుదలైన న్యూడ్ లుక్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కేసు కూడా బుక్ అయింది. దీనిపై అమీర్ ఖాన్ మాట్లాడుతూ... తాను పబ్లిసిటీ కోసం అలా చేయలేదని, సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందని తెలిపారు.
 
ఆగస్టు 20న విడుదలయ్యే పోస్టర్లో రేడియో కూడా అడ్డం ఉండదని చెప్పిన అమీర్ ఖాన్... సెకండ్ పోస్టర్లో నిండుగా బట్టలేసుకుని దర్శనమిచ్చాడు. రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది.
 
డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments