రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో సోమవారం రాత్రి విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో యువన్ శంకర్ రాజా సమకూర్చిన బాణీలు మెలోడి బాగున్నాయని ఆడియో సంస్థలు చెబుతున్నాయి. ఇందులో హీరోయిన్ను ఉద్దేశించి గులాబీ కళ్లు, కొక్కో కోడి, నీలిరంగు చీర అంటూ సాగే పాటలను మొదటగా రామ్ చరణ్ వాయిస్తో రావడం విశేషం.
ఇదికాకుండా ఇంట్రడక్షన్ సాంగ్ మొత్తం చిత్రానికి హైలైట్గా వుంటుంది. ఈ పాటలు వినడానికి చాలా బాగున్నాయి. తెరపై చూస్తే మరింతగా బాగుంటయని ఆడియో సంస్థ తెలియజేస్తుంది. ఇప్పటికే పలు ఆర్డర్లు వస్తున్నాయనీ, త్వరలోనే ప్లాటినం డిస్క్కు చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.
ఈ పాటలు గతంలో చరణ్ ఆరెంజ్ చిత్రంలోని మెలోడీని పోలి వున్నాయని అంటున్నారు. అన్నట్లు ఆరెంజ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పిలకతో కనిపించాడు. ఇప్పుడు గోవిందుడు అందరివాడెలె చిత్రంలోనూ సేమ్ టు సేమ్ అలాంటి పిలకతోనే కనబడుతున్నాడని చర్చించుకుంటున్నారు. పోలికైతే బాగుంది కానీ ఆ సినిమా ఫెయిల్ అయింది మరి.