నవ్విస్తూ, భయపెట్టే చిత్రం 'గీతాంజలి'. కథానాయిక అంజలి ముఖ్య భూమిక పోషించింది. కోన వెంకట్ రచన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి పాత్రలు నవ్విస్తాయి. దర్శకుడు రాజాకిరణ్ నడిపిన విధానం ఆకట్టుకుంది.
లక్కరాజు ప్రవీణ్ సంగీతం అలరించింది. ఈ చిత్రం బుల్లితెరపై మరోసారి రానుంది. ఈ నెల 25న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రేక్షకుల కోరిక మేరకు ప్రదర్శిస్తున్నామని జీ తెలుగు ప్రతినిధి ప్రకటనలో పేర్కొన్నారు.