సినిమా రంగానికి చెందిన సుశాంత్ రెడ్డి అనే ఓ వ్యక్తి జూబ్లిహిల్స్లో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న నైజీరియా ముఠాతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఐతే ఈయన ఓ చిన్న సినిమాను నిర్మించినవాడు కావడంతోనూ, ఆయన డ్రగ్స్ కేసులో పట్టుబడేసరికి మీడియాలో టాలీవుడ్లో డ్రగ్స్ పరవళ్లు తొక్కుతున్నాయంటూ కథనాలు వచ్చేశాయి. ఆ సంగతి అలా ఉంచితే డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ లింకులు ఉన్నట్లు మరోసారి బయటపడ్డాయి.
మంగళవారం అరెస్ట్ చేసిన డ్రగ్స్ మాఫియా ముఠాకు సీసీఎల్ పీఆర్వో రవి పనసాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో రవి పనసాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐతే పనసా రవి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడనీ, ఓ మంత్రి చేత చెప్పించి తప్పించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.