Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ దర్శకుడు 'బాపు' కన్నుమూత... శోకంలో టాలీవుడ్

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (20:23 IST)
తెలుగు వెండితెర ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు 'బాపు' ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 80 ఏళ్ల బాపు పూర్తి పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఆయన 1933 డిసెంబర్ 15న వేణుగోపాల రావు, సూర్యకాంతమ్మలకు జన్మించారు. 'సాక్షి' తొలి చిత్రంతో దర్శకునిగా పరిచయమైన బాపు చివరి చిత్రం 'శ్రీరామ రాజ్యం'. ఈ శ్రీరామ రాజ్యం సినిమా షూటింగ్ సమయంలోనే మిత్రుడు, రచయిత ముళ్లపూడి వెంకట రమణ కన్నుమూశారు.
 
బాపు, రమణల ద్వయం వెంటవెంటనే పరమపదించడంపై తెలుగు సినీ పరిశ్రమ శోకంలో మునిగిపోయింది. బాపు 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. రెండు సార్లు జాతీయ పురస్కారాలతోపాటు 5 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. 1986 సంవత్సరంలో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు, 2013లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments