Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ విలన్ రిలీజ్‌తో ధనుష్ ఐశ్వర్యాకు డబ్బే డబ్బు.. కమల్‌కు లాస్

Webdunia
బుధవారం, 20 మే 2015 (11:26 IST)
కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తమ విలన్ కలెక్షన్ల సునామీని సృష్టించడంలో మాత్రం విఫలమైంది. ఇందుకు కారణం లేటుగా రిలీజ్ కావడమని సినీ పండితులు అంటున్నారు. ఈ సినిమా వచ్చి రెండు వారాలు దాటగా, ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదని తెలుస్తోంది.

వాస్తవానికి ఈ నెల 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేయాలని భావించగా, ఆర్థిక వ్యవహారాల కారణంగా 2వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, కమల్ హాసన్ చిత్రానికి ఏర్పడ్డ నష్టం రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా ధనుష్ కు‌వరంగా మారి కాసులు కురిపించింది.
 
మే 1న ఆమె దర్శకత్వం వహించి నిర్మించిన 'వెయ్ రాజా వెయ్' చిత్రం విడుదలైంది. ఆ రోజు కమల్ సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చిన వారంతా ఈ సినిమా చూడాల్సి వచ్చింది. దీంతో పాటు ఉత్తమ విలన్ కోసం బుక్ చేసుకున్న థియేటర్లలో సైతం ఇదే చిత్రాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. దీంతో లో బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన 'వెయ్ రాజా వెయ్' తొలిరోజున రూ. 3.3 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ వివరించారు. అలా కమల్ ఖాతాలోకి వెళ్లాల్సిన డబ్బు ఇలా ఐశ్వర్యకు చేరింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments