తాను నటుడిగా దూరమై రాజకీయాల్లో వున్నా.. ఎప్పుడూ బాధపడలేదని మెగాస్టార్ చిరంజీవి చెపుతున్నారు. తన కొడుకును నాలో చూసుకున్నానని చెప్పిన ఆయన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా వేడుకలో పాల్గొన్నారు. సోమవారం రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబమంతా హాజరయ్యారు. కానీ, ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం హాజరుకాలేదు.
అయితే పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తాడు అని చిరంజీవి చెప్పాడు. అదెపుడు అంటే... రామ్చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే.. చిత్రం 150వ రోజు వేడుకలకు వస్తాడని చెప్పాడు. ఇకపోతే.. గోవిందుడు అందరివాడేలో సినిమాకు కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని చెప్పారు. దర్శకుడు కృష్ణవంశీలో నిజాయితీ డెడికేషన్ నచ్చాయి. కుటుంబ విలువలుగల కథలు బాగా తీస్తారు. ఆయన చిత్రాలన్నీ అలాంటివేనన్నారు.
ఈ చిత్రంలో కొన్ని రీష్యూట్ చేయాలని అన్నారు. చేయమన్నాను. చాలా ధైర్యంగా కృష్ణవంశీ చేశారు. ఇప్పుడు సినిమా బాగా వచ్చింది. నిర్మాత గణేష్ చిన్నస్థాయి నుంచి పైకి ఎదిగాడు. మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి పేరు వస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.