Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవు లాగే చేపలు కూడా పవిత్రమైనవి.. తినకూడదు.. కమల్ సంచలన వ్యాఖ్య..!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (14:48 IST)
గోవు మాంసాన్ని తినరాదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై విశ్వనాయకుడు కమల్ హాస్పన్ స్పందించారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ... ఒక్క గోవునే కాదు, ఆ మాటకొస్తే ఏ జంతువుని చంపి తినకూడదు అని, చివరికి చేపలని కూడా తినకూడదు అని వ్యాఖ్యానించారు.
 
ఎందుకంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణునే మత్స్యావతారం ఎత్తాడని గుర్తుచేశారు. కనుక గోవు లాగానే చేపలు కూడా పవిత్రమైనవి అని ఆయన అన్నారు. ఇప్పటికీ దేశంలో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు చేపలు తింటున్నారని, కొన్ని శతాబ్దాల క్రితం బ్రాహ్మణులూ ఆవు మాంసాన్ని తినేవారని మన హిందూ పురాతన గ్రంధాలలో ఉన్నదని కమల్ తెలిపారు.
 
అయితే మాంసాహారం తినాలా, లేక శాఖాహారం తినాలా అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. తానైనా, తన ఆరోగ్య కారణాల వలన ఆవు మాంసం తినడం లేదని అన్నారు. ఇక కమల్ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపుతాయో వేచి చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments