‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’ అంటూ... త్రివిక్రమ్ ఇండస్ట్రీ రికార్డ్ సృష్టిస్తే, బన్నీ ‘రేసుగుర్రం’లా రెచ్చిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
‘జులాయి’ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. ఈ నెలాఖరుతో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. డిసెంబర్లో పాటల్ని, పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. అదే నెలలో సినిమా ఫస్ట్లుక్ కూడా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 5న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
బన్నీ నటన ఈ చిత్రానికి హైలైట్. సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ ఇందులో కథానాయికలు. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ ఇందులో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఆద్యంతం నిండుగా, కన్నుల పండువగా ఈ సినిమా ఉంటుందని నిర్మాత చెప్పారు.