మిల్కీ బ్యూటీ నోట మహేష్... మహేష్... మహేష్... నువ్వే దిక్కు!

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2013 (12:55 IST)
FILE
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్‌వన్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ సినిమాలు చాలవన్నట్లు బాలీవుడ్‌కు జంప్ అయిన తమన్నా...ఇప్పుడు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతోంది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి కెరీర్‌ను మలుచుకుంటున్న సమయంలో వున్నట్టుండి హిందీ సినిమా పరిశ్రమకు లగెత్తింది.

అయితే బాలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకుందామనుకున్న ఈ మిల్కీబ్యూటీ అక్కడ చతికిల పడింది. 'హిమ్మత్ వాలా' చిత్రం ఫ్లాపైంది. కానీ తమన్నా గ్లామర్‌, పెర్ఫార్మెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో నెంబర్‌వన్ హీరోయిన్ అవకాశాన్ని మిస్ అయినందుకు తెగ బాధపడిపోతున్న ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్‌పై కన్నేసింది.

తెలుగులో నిలదొక్కుకోవాలంటే మహేశ్ బాబు ఒక్కడే తనకు దిక్కని భావించింది. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన 'ఆగడు' చిత్రంలో కూడా తమన్నా ఎంపికైంది. గత కొంత కాలంగా తెలుగులో తమన్నాకు సరైన హిట్ లేదు. దీంతో సౌత్ చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

కథ, హీరో, దర్శకుడు లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. మహేష్ బాబు తప్ప ఎవరితోనూ వద్దంటున్న తమన్నా ఇప్పుడు మహేష్ నామ జపం చేస్తోంది. మహేష్ బాబుతో కలిసి ఒక్క హిట్టు కొడితే తన రేంజ్ మరింత పెరుగుతుందనేది తమన్నా ఆలోచన.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

Show comments