Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని రాకను చూసి పక్క రాష్ట్రానికి పారిపోయిన కేసీఆర్ : వైఎస్ షర్మిల

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (16:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దెబ్బకు భయపడి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్క రాష్ట్రానికి పారిపోయారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ నగరానికి ప్రధాని మోడీ వచ్చిన విషయం తెల్సిందే. ప్రధాని నగరానికి వచ్చిన వెళ సీఎం కేసీఆర్ బెంగుళూరు పర్యటనకు వెళ్లిపోయారన్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 
 
"ఢిల్లీ కోటలు బద్ధలు కొడతాం. కడిగిపారేస్తాం.. ఏకిపారేస్తాం అన్న కేసీఆర్ సారూ.. మోడీ ఇక్కడకు వస్తే మీరెక్కడికి పారిపోయారు? అంటూ షర్మిల ప్రశ్నించారు. "మా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనవు? మద్దతు ధర ఎందుకు ఇవ్వవు అని ఏకిపారేయలేకపోయావా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్టుగా మోడీ గారొస్తే పిరిగివాడిలాగా పారిపోతావా? అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
 
"కేసీఆర్ పాలన అవినీతి మయం అని మోడీ చెబుతారు. మోదీ అవినీతి చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్ చెబుతారు. కానీ ఇద్దరూ ఎదురుపడరు. ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టుకోరు. జనాన్ని మాత్రం పిచ్చోళ్లను చేస్తారు. మీవన్ని ఉడుత ఊపు ప్రసంగాలేనా? అని షర్మిల నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments