Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్‌లో రాసిచ్చిన ఘనుడు ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (14:35 IST)
తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కొత్తగా పార్టీని ఏర్పాటు చేయనున్న వైఎస్.షర్మిల మండిపడ్డారు. 'నిజామాబాద్ జిల్లాకు ప‌సుపు బోర్డు తెస్తాన‌ని ఎవ‌రో బాండ్ పేప‌రో ఇచ్చారంట‌... బాండ్ పేప‌ర్ ఇచ్చి రైతుల‌ను ద‌గా చేశారట'  అంటూ అరవింద్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 
 
ఆమె శుక్రవారం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానుల‌తో ష‌ర్మిల భేటీ అయ్యారు. శుక్రవారం లోటస్ పాండ్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
'ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి ఉండ‌టం తెలియ‌దా? ప‌సుపు రైతుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం, ఎక్స్‌టెన్ష‌న్ సెంట‌ర్ ఇస్తే ప‌సుపు రైతుల క‌ష్టాలు తీరుతాయా? ప్ర‌తి గ‌డ‌ప‌కు పూసే ప‌సుపు పండించే రైతు క‌ష్టాలు క‌న‌ప‌డ‌టం లేదా? బైంసాలో మత‌క‌ల్లోలాలు సృష్టించ‌డంపై ఉన్న ఆస‌క్తి రైతుల క‌ష్టాల‌పై ఉండ‌టం లేదా?' అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments