Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరిసేడు గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహారదీక్ష

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:43 IST)
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల మరోమారు నిరుద్యోగ నిరాహారదీక్షకు దిగారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఆమె ఈ దీక్షను ప్రారంభించారు. 
 
ప్రతి మంగళవారం ఆమె నిరుద్యోగ వారం-నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిరిసేడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
 
షబ్బీర్‌ తల్లిదండ్రులను ఓదార్చి వారికి అండగా ఉంటామని ష‌ర్మిల‌ భరోసా ఇచ్చారు. అనంతరం ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి సిరిసేడులో దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్ష‌ సాయంత్రం 5 గంటల వరకు జ‌ర‌గ‌నుంది. 
 
తెలంగాణ‌లో ల‌క్షా 90 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసే వ‌ర‌కు తాను పోరాడుతూనే ఉంటాన‌ని ష‌ర్మిల గతంలోనే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు ఈ దీక్షను పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments