మంత్రి నిరంజన్ రెడ్డి ఓ వీధి కుక్క : వైఎస్. షర్మిల

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (18:52 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరంజన్ రెడ్డిని ఓ వీధి కుక్కతో సంబోధించారు. కుక్క మొరిగినంత మాత్రాన అబద్ధాలు నిజం కావన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని వైఎస్ఆర్‌లా బతకాలని ఆమె సలహా ఇచ్చారు. 
 
ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్ గురించి తెలియకుండానే మొరిగితే... అబద్ధాలు నిజం కావన్నారు. వైఎస్ మరణిస్తే 700 గుండెలు ఆగిపోయాయని విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఇకనైనా నిరంజన్ రెడ్డి సిగ్గు తెచ్చుకుని వైఎస్సార్‌లా జీవించాలని హితవు పలికారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకేకాకుండా తెలంగాణ తల్లికి కూడా వెన్నుపోటు పొడిచారని అన్నారు. పథకాల పేరు చెప్పి, మోసపూరిత హామీలను ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బంగారు తెలంగాణ అనేది కేవలం కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమేనని, తెలంగాణ ప్రజానీకానికి కాదని ఆమె వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments