మరో పోరాటానికి సిద్ధమైన వైఎస్ షర్మిల... 72 గంటల పాటు..

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (10:10 IST)
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల శనివారం దీక్ష చేయనున్నారు. 72 గంటల పాటు వైయస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు.
 
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన నిరాహారదీక్షకు కూర్చోనున్నారు వైఎస్ షర్మిల. మిగతా 48 గంటలు లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేయనున్నారు వైయస్ షర్మిల. రైతులకు అండగా ఉండేందుకు షర్మిల ఈ దీక్ష చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
 
ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు పై ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీలు ధర్నా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. రైతుల పట్ల కేంద్ర విధానాలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ ఆందోళనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అలాగే రైతులు అందరూ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments