Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలీనం వార్తలను ఖండించిన వైఎస్ షర్మిల.. నా ఆరాటం.. నా పోరాటం..

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (09:52 IST)
వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారన్న కథనాలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల సీరియస్‌గా స్పందించారు. కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారనే వార్తలు తెగ ప్రచారమవుతున్నాయి. 
 
దీనిపై షర్మిల స్పందిస్తూ.. ఊహాజనిత కథలు కల్పిస్తూ.. తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. విలీనం వార్తలను ఖండించారు. తన భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనేనని.. తన ఆరాటం, తన పోరాటం తెలంగాణ కోసమేనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తన రాజకీయ భవితపై పెట్టే సమయాన్నికేసీఆర్ పాలనపై పెట్టాలని సూచించారు. 
 
మరోవైపు షర్మిల ఉన్నట్టుండి ఈ ప్రకటన చేయడం వెనుక తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు కూడా ఓ కారణమని తెలుస్తోంది. వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ హైకమాండ్ టచ్‌లో ఉందని థాక్రే అన్నారు. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో లాభం ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఎంతగానో కష్టపడుతున్నారని అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments