వైఎస్ షర్మిల అరెస్ట్.. కేసీఆర్ పతనానికి ఇదే నాంది..

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (16:01 IST)
YS sharmila
టీఆర్‌ఎస్‌ పాలనకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె చేపట్టిన నిరాహార దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. 
 
దీంతో ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు వాహనంలో బలవంతంగా తరలించారు. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పక్కకు నెట్టి అరెస్టు చేశారు. 
 
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ మరోసారి నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌కు తప్పులు చేసిన చరిత్ర ఉందని, ఆయన పతనానికి ఇదే నాంది అని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు షర్మిలపై ఆమెపై కేసు పెట్టే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Supriya : డెకాయిట్‌ క్లైమాక్స్ రిస్క్ అనిపించలేదు : సుప్రియ యార్లగడ్డ

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ ఈతరం జెన్ జీ కిడ్స్ కు బాగా నచ్చుతుంది : వి. మునిరాజు

ఆప్ క్యూట్ హో... మోడల్ తాన్యా ఛటర్జీకి చాహల్ మెసేజ్ (Video)

Suma: రాజీవ్ ఐక్యూ వర్సెస్ సుమ జీబీ పేరుతో టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో సుమ, రాజీవ్

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తమ రెండవ స్టోర్, సీజనల్ ఎడిట్‌తో వైజాగ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన సోచ్

తర్వాతి కథనం
Show comments